వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది

` పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్ల నిర్మాణం
` జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు
` వందేభారత్, అమత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు
` ఆయుష్మాన్ భారత్‌తో కోట్లమందికి వైద్యం
` వరిధాన్యం ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ వన్
` అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజ
` గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివద్ధి
` జీఎస్‌టీ శ్లాబుల తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి
` పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతున్న భారత్
` గ్రీన్ ఎనర్జీ రంగంలో పవర్ హౌస్‌గా భారత్
` పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ(జనంసాక్షి): దేశం వికసిత్ భారత్ వైపు పయనిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్లు కట్టించామని, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. ’పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. సామాజిక న్యాయం ప్రాతిపదికన కేంద్రం పనిచేస్తోందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజైన బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ…వందేభారత్, అమత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించాం. ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్‌తో కోట్లమందికి వైద్యసేవలందిస్తున్నాం. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెం1 స్థానంలో నిలిచింది. అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజలో ఉందని రాష్ట్రపతి వెల్లడించారు.దేశంలో స్పేస్ టూరిజం అభివద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకశ్మీర్‌లో అత్యంత ఎతెí్తన రైల్వే బ్రిడ్జి నిర్మించామని గుర్తు చేశారు. గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వ ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోంది. జిఎస్‌టి స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.12లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశాం. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోంది. భారత్ పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్‌ను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు. వికసిత్ భారత్‌లో రైతుకు అధిక ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. గ్రావిÖణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చాం. దేశాభివద్ధిలో మహిళలకు కీలక పాత్ర కల్పించాం. ఆపరేషన్ సిందూర్.. మన సైనికుల సత్తా చాటింది. భారత్‌పై దాడిచేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం చూసింది. రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతి రికార్డు స్థాయిలో పెరిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. నానో చిప్‌ల తయారీపైనా భారత్ దష్టి సారించింది. మైక్రో చిప్‌ల తయారీలో స్వయంసమద్ధి సాధించాలి. ఎలక్టానిక్స్ పరిశ్రమలో 15లక్షల ఉద్యోగాలు సష్టించగలిగాం. ముద్ర యోజన ద్వారా చిరువ్యాపారులకు భారీగా రుణాలు అందించాం. వంటి ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో వెల్లడించారు. పీఎం విశ్వకర్మ యోజనతో 20లక్షల మందికి శిక్షణ ఇస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. ఎన్డీఏ పదేళ్ల పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని.. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వికసిత్ భారత్‌లో రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం కషి చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భవిష్యత్తును దష్టిలోపెట్టుకొని దేశం సంస్కరణల పథంలో దూసుకెళ్తోందన్నారు. పీఎలఐ పథకం కింద పారిశ్రామికోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్టానిక్ ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. సముద్ర వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.అంతకుముందు పార్లమెంట్‌కు చేరిన రాష్ట్రపతికి స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి రాధాకష్ణన్, ప్రధాని మోడీ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెను సాదరంగా పార్లమెంట్ భవనంలోకి తోడ్కొని వెళ్లారు.