బాలికపై అత్యాచారం

హిసార్: హర్యానాలో మానవత్వం మంటగలిసిన సందర్భం. తానొక మనిషినని మరిచి పోయి పశువుల ప్రవర్తించిన వైనం. ఎనిమిదేళ్ల బాలికపై జీతా రామ్ 53 ఏళ్ల వ్యక్తి(బంధువు) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు బయట తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న పాపను తన గదిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి తెగబడ్డాడు. హిసార్ జిల్లాలోని సబాల్ పూర్ అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపులు ప్రారంభించారు.