బా.రా.స కి ప్రజలు బ్రహ్మరథం-ఎమ్మెల్యే సోదరుడు సూర్యంరెడ్డి.

భైంసా రూరల్ నవంబర్ 17జనం సాక్షి

ఎటు చూసినా కెసిఆర్ సంక్షేమ పథకాలు, తాలూకాలో విట్టల్ రెడ్డి పాలనకి తాలూకా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బి.అర్.ఎస్ నాయకులు సూర్యంరెడ్డి అన్నారు.
బైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో శుక్రవారం బా.రా.స విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.విట్టల్ రెడ్డి సోదరుడు సూర్యంరెడ్డి బి.ఆర్.ఎస్ నాయకులు ప్రచారంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ ప్రచారంలో నాయకులు మనకుర్ రామ్ కుమార్,మండల బి.అర్.ఎస్ సర్పంచ్లు,నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు