బిజెపిని బలపర్చండి: అమిత్‌ షా

బెంగళూరు,మే9(జ‌నం సాక్షి): కర్ణాటక అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపు నిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బలమైన జాతి నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా కన్నడిగులు ఓటేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు, రైతులకు సిద్దారామయ్య ప్రభుత్వం చేసిందేవిూ లేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఆయన హావిూ ఇచ్చారు. మాండ్య, మైసూర్‌, హసన్‌తో పాటూ ఐదు జిల్లాల్లో కొబ్బరి ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేస్తామని అమిత్‌షా చెప్పారు.