బిజెపి నేత ఇంట్లో నగదు పట్టివేత

బెంగుళూరు,మే9(జ‌నం సాక్షి):  కర్ణాటక శాసనసభ ఎన్నికలు శనివారం జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల అధికారులు ఇవాళ కొప్పాల్‌ జిల్లాలోని గంగావతిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విరూపాక్ష ఇంట్లో నుంచి రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ నేత షమిద్‌ మానియర్‌ ఇంటి నుంచి రూ.30వేలు సీజ్‌ చేశారు.