బిజెపి పార్టీలో చేరిన సర్పంచ్

మునుగోడు సెప్టెంబర్26(జనంసాక్షి):
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో మరింత దూకుడు పెంచారు.ఆయన విస్తృత ప్రచారం చేస్తూనే ఇటు చేరికలపైన ప్రధాన దృష్టి సారించారు.సోమవారం మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సర్పంచ్ పగిళ్ళ బిక్షం తన అనుచరులతో బీజేపీలో చేరారు.వారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిజేపిలో చేరారు.వారికి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.త్వరలో మునుగోడు మండలంలో మరిన్ని చేరికలు ఉంటాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.ఉపఎన్నికల్లో మునుగోడులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.