బిజ్వారం నుండి అడవి రావులచెరువు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

మల్దకల్ జూన్15(జనంసాక్షి) గద్వాల నియోజకవర్గం లో మల్డకల్ మండలం పరిధిలోని బిజ్వారం గ్రామ సమీపంలో బిజ్వారం నుండి అడవి రావులచెరువు వైపు వెళ్లే మార్గం నుంచి రోడ్డు నిర్మాణానికిఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను బుధవారం ప్రారంభించారు.త్వరగా కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం పనులు పూర్తిచేసి రైతులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి,సింగిల్విండో చైర్మన్  తిమ్మారెడ్డి, సర్పంచ్ లక్ష్మన్న , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, తెరాస పార్టీ నాయకులు,శ్రీనివాస్ రెడ్డి, చక్రధర్ రెడ్డి,మధు కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.