బిడబ్య్లూసీ ర్యాంక్‌ల్లో కాశ్యప్‌ హవా

ఢిల్లీ : లండన్‌ ఒలంపిక్స్‌ క్వాటర్‌ ఫైనల్‌కు చేరి సంచలనాలు సృష్టించిన పార్లపల్లి కాశ్యప్‌ గురువారం ప్రపంచ బ్యాట్మింటన్‌ సమాఖ్య (బిడబ్య్లూసీ) విడుదల చేసిన ర్యాకింగ్‌లో ఆరవ స్థానాన్ని చేజేక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరిస్‌లో పురుషుల సింగిల్‌ మ్యాచ్‌లో ప్రపంచ, ఆసియా, ఒలంపిక్స్‌ మాజీ చాంపియన్‌ తోఫిక్‌ హిదాయత్‌ (ఇండోనేషియా) జరిగిన మ్యాచ్‌ ఓడిపోవడంతో ఒక ర్యాంక్‌ మాత్రమే ఎగబాకి 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ప్రపంచ బ్యాట్మింటన్‌ సమాఖ్య (బిడబ్య్లూసీ) విడుదల చేసిన ర్యాకింగ్‌లో ఆరవ స్థానాన్నిన చేజెక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరిస్‌లో  మొదటి మ్యాచ్‌లో సునాయసంగా గెలిచిన పదుహేడు సంవత్సరాల పివి సింధూ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు 15వ స్థానం, మహిళ సింగిల్స్‌లో సంచలనాల సైనా నెహ్వాల్‌ రెండవ స్థానం దక్కించుకున్నారు. ఆర్వీఎం గురుసాయి దత్‌, సౌరభ్‌ వర్మ కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకొని 33, 36వ స్థానాల్లో కొనసాగుతున్నారు. మరొక భారత సెట్లర్‌ అజేయ్‌ జయరాం 30వ స్థానంలో కొనసాగుతున్నాడు.