బీఆర్ఎస్ లో భారీ చేరికలు.

బెల్లంపల్లి, నవంబర్ 13, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం పాత బెల్లంపల్లి, కన్నాల, టేకులబస్తీ నుంచి ఇతర పార్టీలకు చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న అభివృద్ధికి, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కాగా సోమవారం నాడు సైతం బెల్లంపల్లి నియోజకవర్గం సోమగూడెం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చుంచు మల్లమ్మ – లింగయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి క్షిణిస్తుందని, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆమె వివరించారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, అకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, మండల కో అప్షన్ సభ్యుడు చాంద్ పాషా, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.