బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఘనంగా దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో దేవి శరన్య నవరాత్రి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు కృష్ణానది సమీపంలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఆదిలక్ష్మి అవతారంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే అభయ ఆంజనేయస్వామి ప్రాంగణంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు యాక్తాపురం, కొండపేట, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, కొండేరు, జింకలపల్లి, కోదండపురం, తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.