బీజేపీలోకి సౌరభ్ గంగూలీ?

న్యూఢిల్లీ: మాజీ టీమిండియా కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.  దీనిలో భాగంగానే గురువారం బీజేపీ పెద్దలతో సమావేశమైన గంగూలీ వారితో చర్చిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. 2008లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా క్రికెట్ వ్యాఖ్యాతగా మారాడు.

అయితే తాజాగా బీజేపీ పెద్దలతో జరుపుతున్న మంతనాలు ఫలితాన్నిస్తే మాత్రం గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.  ఇదిలా ఉండగా  2014లో జరిగిన సాధారణ ఎన్నికల ముందు కూడా గంగూలీ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.