బీజేపీలో సంక్షోభం లేదు: రాజ్నాథ్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవటంలో ఎలాంటి సంక్షోభం లేదని కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న తమ పార్టీకి ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలో తెలుసునని ఆయన అన్నారు.
తామంటే గిట్టని పార్టీలు బీజేపీలో సంక్షోభం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాజ్నాథ్ హెచ్చరించారు.