బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా కట్టా సుధాకర్ రెడ్డి నియామకం.

హర్షం వ్యక్తం చేసిన జిల్లా బిజెపి శ్రేణులు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13 (జనంసాక్షి):
అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కట్టా సుధాకర్ రెడ్డి గతంలో ఎబివిపి లో పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశారు.విద్యార్థి నాయకుడిగా కార్పోరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు కెళ్ళారు. సాంఘీక సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ప్రభుత్వం పై ఎన్నో పోరాటాలకు రూపకల్పన చేశారు.విద్యారంగ సమస్యలపై నిజాం కాలేజీలో లక్ష మంది విద్యార్థులచే సమరశంఖం పూరించారు.ఎబివిపి రాష్ట్ర కార్యదర్శిగా విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం చేసి ఎన్నోసార్లు జైలు కెళ్ళారు.రాజకీయ క్షేత్రంలో గతంలో
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర అధ్యక్షుని వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా, వరంగల్ జిల్లా ఇన్ ఛార్జ్ గా పనిచేశారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు.వీరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా పయనిస్తున్న ఈ సమయంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం కీలక పరిణామం.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వాసికి బండి సంజయ్ టీంలో బాధ్యత రావడం పట్ల బీజేపీ కార్యకర్తలందరూ ఆనందం వ్యక్తం చేస్తూ…రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.