బీహార్ సిఎంగా నితీష్కు అవకాశం
పాట్నా,ఫిబ్రవరి20( జనంసాక్షి)
: గత కొన్ని రోజులుగా వేడెక్కి ఉన్న బీహార్ రాజకీయాలు చల్లబడ్డాయి. బీహార్ సీఎంగా ఆదివారం నితీష్కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఆయనకు రాజ్భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రాజ్భవన్కు రావాలని గవర్నర్ ఆహ్వానించారు. ఉదయం బీహార్ సీఎంగా జితన్రామ్ మాంఝీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఆయన సిఎంగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే మాంజీని పార్టీ నుంచి బహిష్కరించారు. అక్కడున్న విపక్ష పార్టీలన్నీ నితీష్ కుమార్కే మద్దతు పలికాయి. దీంతో బిజెపి కూడా వెనక్కి తగ్గింది.