బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురి అరెస్ట్

న్యూఢిల్లీ : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్ట్ చేసింది.  కాగా పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో గత ఏడాది అక్టోబర్ రెండో తేది బాంబు పేలుడు సంభవించి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే.