బూర్గంపహాడ్ ఆగష్ఠ్25 (జనంసాక్షిి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజరు గ్రామం నిరుపేద శశికళ కుటుంబానికి జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ ఆధ్వర్యంలో క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ మాట్లాడుతూ స్వచ్ఛంద దాతల సహకారంతో ఈ బియ్యాన్ని అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలు గోవింద్, నవీన్, బాలకృష్ణ, అశోక్, రవీందర్, రామిరెడ్డి, లక్ష్మణరావు కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తము స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, పుట్టి నరసింహారావు, జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా నాయకురాలు బోడ దివ్య , జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

మల్దకల్ ఆగస్టు 25 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో స్నేహ మొబైల్ షాప్ నుగురువారం గద్వాల వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న ప్రారంభించారు. పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ నిర్వాహకులు లక్ష్మణ్, లాలన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు.షాపు యజమానులు చైర్ పర్సన్ దంపతులతో పాటు పాల్వాయి సర్పంచ్ శివరామ్ రెడ్డిలను శాలువా పూలమాలలతో సత్కరించారు.ముందుగా శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్కెట్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్వాయి ఉప సర్పంచ్ రంజిత్,తెరాస పార్టీ నాయకులు ఏసు రత్నం,ఆంజనేయులు,జీవరత్నం, ప్రభాకర్,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.