బౌద్ధ సన్యాసి పై దాడి

తంజావూరు : శ్రీలంకకు చెందిన బౌద్ధ సన్యాసి పథ్‌యేరియో జ్ఞానలోక థిరోపై తమిళనాడులోని తంజావూరులో దాడి జరిగింది. ఢిల్లీలోని ఆర్కియాలాజికల్‌ సర్వే ఇనిస్టిట్యూట్‌(ఏఎస్‌ఐ) విద్యార్థి జ్ఞానలోక స్టడీ టూర్‌ కోసం తంజావూర్‌కు వచ్చారు. 19 మంది విద్యార్థుల బృందంతో కలిసి వచ్చిన ఆయన బృహదీశ్వర్‌ ఆలయాన్ని సందర్శిస్తున్న సమయంలో పలు తమిళ సభ్యులు దాడికి దిగారు. అనంతరం తంజావూర్‌ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి వెళ్తున్నవిద్యార్థుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక రాజధాని కొలొంబోకు చెందిన బౌద్ధ సన్యాసి జ్ఞానలోక గత ఏడాదిన్నరగా ఢిల్లీలో ఉంటూ ఏఎస్‌లో డిప్లమా చేస్తున్నారు.