భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తాం.

సిపిఎం మండల కార్యదర్శి జి అశోక్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్28(జనంసాక్షి):

స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం మండల కార్యదర్శి జి అశోక్ అన్నారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా సిపిఎం కార్యాలయంలో భగత్ సింగ్ 115వ జయంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం 23 ఏళ్ల పసిప్రాయంలోనే ఉరి కంబాన్ని ఎక్కిన మహోన్నతుడు భగత్ సింగ్ అన్నారు.దేశంలో కులం మతం ప్రాంతీయతత్వం వంటి అంశాలను భగత్ సింగ్ వ్యతిరేకించాడని అన్నారు దేశంలో ఒక కులం ఇంకొక కులం ఒక మతం ఇంకొక మతం దోచుకొని సమాజం భగత్ సింగ్ కోరుకున్నాడని అన్నాడు.భగత్ సింగ్ ఈ దేశానికి యువతకు విద్యార్థులకు స్ఫూర్తి దాయకమని అన్నారు తాను ఉరి కంభం ఎక్కుతున్న చివరి నిమిషంలో కూడా పుస్తకాలను చదివే ప్రయత్నం చేశాడని అన్నారు. మార్క్సిజమ్ ద్వారానే ఈ దేశం మారుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ చంద్రమౌళి సురేష్ జాంగిర్ భాను ఆసిఫా మౌలానా భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.