భవనం కూలిన ప్రమాదంలో 397మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో 8 అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 397కి చేరింది. శిధిలాల వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో భవనం యజమాని సోహెల్‌ను కమాండో దళాలు బంగ్లా, భారత్‌ సరిహద్దులో పారిపోతుండగా పట్టుకుని హెలికాప్టర్‌లో రాజధానికి తరలించారు.