భాజపా ఓ ఉగ్రవాద సంస్థ 

 రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తుంది
భాజపాపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మమత బెనర్జీ
కోల్‌కతా, జూన్‌21(జ‌నం సాక్షి): భాజపా ఓ ఉగ్రవాద సంస్థల అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం విూడియాతో ఆమె మాట్లాడుతూ.. భాజాపాను ఓ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించారు. ‘మా పార్టీ(టీఎంసీ పార్టీ) భాజపాలా కాదు. కైస్త్రవులు, ముస్లింలతోపాటు హిందువుల మధ్య కూడా  భాజపా చిచ్చు పెట్టాలని చూస్తుందన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని యత్నిస్తున్నారంటూ మమతా వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య దాడులు-ప్రతిదాడులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కార్యకర్తల అనుమానాదాస్పద మృతులతో ఇరు పార్టీలు ‘రాజకీయ హత్యలు’గా పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.  ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ టీఎంసీ పార్టీ నేతలను, కార్యకర్తలను బెదిరించారు. గతవారం జల్‌పైగురిలో నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శన సందర్భంగా ‘రౌడీయిజానికి పాల్పడితే టీఎంసీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయిస్తానని, ఎన్‌కౌంటర్‌ చేయిస్తానని’ దిలీప్‌ బహిరంగంగా వ్యాఖ్యాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మమతా ఇలా తీవ్రంగా స్పందించారు. మరోపక్క తీవ్ర వ్యాఖ్యలకుగానూ దిలీప్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ, టీఎంసీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.