భాజపా ప్రచార సారథిగా మోడీ తొలి ప్రసంగం

పఠాస్‌కోట్‌ : భాజపా ప్రచారసారథి హోదాలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తొలిసారిగా పంజాబ్‌లోని పఠస్‌కోట్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌ దుర్ఘటన గురించి మాట్లాడుతూ యావత్‌ దేశం ఆ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. డా. శ్యామాప్రసాద్‌ లాంటి ఎందరో దేశభక్తులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, కానీ కాంగ్రెస్‌ ఆ త్యాగాలను గురించదని మోడీ విమర్శించారు. దేశ యువతకు తమను తాము నిరూపించుకునే అవకాశాలు కావాలన్నారు. కాంగ్రెస్‌  చేతిలో దేశం సురక్షితంగా ఉండబోదని ఆయన పేర్కొన్నారు.