భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి

టేకులపల్లి, ఆగస్టు 27( జనం సాక్షి): వచ్చే సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టే తెలంగాణలో భారత్ జూడోయాత్రను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పిలుపునిచ్చారు . ఈ యాత్రను విజయవంతం కావడానికి తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో జరిగే భారత్ జోడో యాత్ర ను అందరూ కలిసి విజయవంతం చేయాలని  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం లక్కినెని ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధ్వర్యంలో రోహిత్ చౌదరి, మాజీ కేంద్రమంత్రి పోరికా బలరామ్ నాయక్ లను శాలువాతో సత్కరించారు.ఈ  కార్యక్రమంలో జిల్లా నాయకులు భూక్యా దళ్ సింగ్ నాయక్ ,టేకులపల్లి మండల ప్రెసిడెంట్ గుండా నరసింహ రావు ,దమ్మపేట హరి బాబూ ,అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు సత్యనారాయణ చౌదరి ,ఇల్లందు మండల ప్రెసిడెంట్ పులి సైదులు,లక్కి నేని సాయి కృష్ణ, జిల్లా DLC మెంబర్,ఎంపీటీసీ రామకృష్ణ ,నాగేంద్ర బాబు ,పాయం వెంకటేశ్వర్లు ,పూజారి వెంకట్ ,చంటి , వానపాకుల రాంబాబు , హరిలాల్  ,ఇస్లవత్ సాయి పాల్గొన్నారు.