భారత వజ్రోత్సవాల సందర్భంగాఫ్రీడమ్ రన్ కొరకు ప్రజా నికానికి ఆహ్వానం పలికిన పోలీసు అధికారులు.

అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 10, (జనం సాక్షి న్యూస్ ) : భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ లు నిర్వహిస్తున్న ఆజాది కా అమృతోత్సవ్ వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, పదర,అమ్రాబాద్, లింగాల ,బల్మూరు ,ఉప్పునూతల,పోలీస్ స్టేషన్ల అధికారుల ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా 11 ఆగస్టు 2022న ఉదయం ఆరు గంటలకు పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఫ్రీడం రన్ పేరిట పరుగు పందెం నిర్వహణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారు ప్రజానీకానికి పిలుపునిచ్చారు అధిక సంఖ్యలో యువత విద్యార్థులు వ యో భేదం లేకుండా అందరు పాల్గొని ఫ్రీడం రన్ను విజయవంతం చేయగలరని కోరారు.