భారత వానికి స్వాతంత్రం సిద్ధించడం కాంగ్రెస్ పార్టీ ఘనత

ఏఐసీసీ నేత కేతూరి వెంకటేశ్
పాన్ గల్, ఆగష్టు 09 ( జనం సాక్షి ) బ్రిటిష్ వారి పాలన నుంచి భారతావనికి స్వాతంత్ర్యం సాధించి, స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ జాతీయ సమన్వయకర్త డాక్టర్ కేతూరి వెంకటేశ్ కొనియాడారు. ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తి పొందడం, భారతీయుల ఐక్యత సాధించడం, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో చేపట్టిన ఆజాదీకి గౌరవ్ పాదయాత్రను మంగళవారం మండలంలోని మహ్మదాపూర్ గ్రామం లో వెంకటేశ్ తో పాటు వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తైలం శంకర్ కొల్లాపూర్ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కల్లబొల్లి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ మత విద్వేశాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభేదాలను పెంచుతున్నారని అన్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 8 ఏళ్ళుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ల పట్ల ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉందని, వచ్చే ఎన్నికల్లో
కాంగ్రెస్ కు పట్టం గట్టడం ఖాయమని అన్నారు. పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తున్నదని, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ జెండా తిరిగి ఎగురుతుందనేే ధీమా వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శులు రంగినేని జగదీశ్వర్, కాటమోని తిరుపతమ్మ, వివిధ శ్రేణుల నేతలు మధుసూదన్ రెడ్డి, ఆది చంద్రయ్య, సుధాకర్ యాదవ్ , అంబటి స్వామి, కొల్లాపూర్ తాలూకా  యువ నేత వహీద్, నర్సిహ్మ నాయుడు, ఇర్షద్ తదితరులు పాల్గొన్నారు.