భారత స్వతంత్ర వజ్రోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ, ఎమ్మెల్యే , కలెక్టర్.

గద్వాల రూరల్ ఆగష్టు 09 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు స్వతంత్రం వజ్రోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ల చేతుల మీదుగా ఇంటింటికి పంపిణీ చేసే జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగినది. అదేవిధంగా ప్రతి కార్యాలయంలో ముందు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలతో పాటు జాతీయ జెండాలను అందజేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, జడ్పీ వైస్ ఛైర్మన్ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, జెడ్పిటిసి రాజశేఖర్ , అధికారులు తదితరులు పాల్గొన్నారు