భూతల దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్‌

` సరిహద్దులో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకుల మొహరింపు
` గాజాపై దండయాత్రకు సిద్ధమని ఐడీఎఫ్‌ చీఫ్‌ ప్రకటన
టెల్‌అవీవ్‌ (జనంసాక్షి):ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరు ప్రస్తుతం తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. హమాస్‌ ఉగ్రవాదుల చెరలో బందీలను కాపాడే విషయంలో ఇజ్రాయెల్‌ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ క్రమంలో గాజాపై భూతల దాడులకు సిద్ధమైన టెల్‌అవీవ్‌.. సరిహద్దు ప్రాంతంలో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఈ నేపథ్యంలో గాజాపై దండయాత్రకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ మరోసారి స్పష్టం చేసింది.’ఒక మాట స్పష్టంగా చెప్పదలచుకున్నా. గాజాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నాం. గాజాలో చొరబాటుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. ఇందు కోసం దేశాధినేతలతో సమన్వయంతో పనిచేస్తున్నాం’ అని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ హెర్జీ హలేవీ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతంలో విూడియాతో మాట్లాడిన ఆయన.. శత్రువుపై దాడి చేయడానికి ప్రతి నిమిషాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. అటు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కూడా తదుపరి పోరుకు సిద్ధంగా ఉన్నామంటు వ్యాఖ్యానించారు. ఇలా గాజాపై దండయాత్ర అనివార్యమని ఇజ్రాయెల్‌ భావిస్తున్న తరుణంలో అమెరికా మరోసారి స్పందించింది. గాజాపై భూతల దాడుల అంశంపై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ స్వయంగా నిర్ణయాలు తీసుకోగలదని స్పష్టం చేశారు.ఇదిలాఉంటే, గాజా వాసులు హమాస్‌ ఉగ్రవాదుల ఉనికిని తమకు తెలియజేయాలని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ కోరింది. అలా చెప్పిన వారికి ప్రైజ్‌మనీని అందజేస్తామని ప్రకటించింది. ఉగ్రవాదుల ఉనికి చెప్పిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కానివ్వబోమని, చెప్పిన వారికి, వారి ఇంటికి రక్షణ కల్పించే బాధ్యత ఇజ్రాయెల్‌ తీసుకుంటుందని హావిూ ఇచ్చింది. విూరు ప్రశాంతంగా బతకడంతోపాటు విూ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ మనవతా సహాయాన్ని చేయాలని గాజా వాసులను కోరింది.