భైంసా పట్టణంలోని ఖాజి గల్లీలోని పోలీసులు నిర్బంధ తనిఖీలు

భైంసా రూరల్ నవంబర్ 17జనం సాక్షినిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఖాజీ గల్లీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వేకువ జాము నుండే కాలనీలోని ఇళ్లకు వెళ్లి సరైన ధ్రువపత్రాలు లేని, ఫైన్ ఉన్న 72 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కేంద్ర సరిహద్దు భద్రతాదాళం సహకారంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు పట్టణ సీఐ శ్రీను తెలిపారు. అపరిచితుల పట్ల కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవలన్నారు

తాజావార్తలు