మండల కేంద్రంలో రెపరెపలాడిన త్రివర్ణ పథకం

– ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
చౌడాపూర్, ఆగస్టు 15( జనం సాక్షి): 75వ స్వాతంత్ర భారత దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌడాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాందాస్ నాయక్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వతంత్ర భారత వజ్రోత్సవాలను  ప్రతి గ్రామంలో కూడా ఎంతో ఆడంబరంగా నిర్వహించారని ప్రజలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ అశోక్ కుమార్ మరియు రెవెన్యూ సిబ్బంది, స్థానిక సర్పంచ్ కొత్త రంగారెడ్డి,ఎంపీటీసీ శంకర్ మరియు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.