మణికొండ అక్రమ నిర్మాణాలపై లోకాయుక్త ఫైర్‌

నివేదిక కోరిన జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి
హైదరాబాద్‌,జనవరి10(జనంసాక్షి):హైదరాబాద్‌ శివారు మణికొండలో అక్రమ నిర్మాణాలపై లోకాయుక్త మండిపడింది. ఫిబ్రవరి 1 లోగా ఇంటింటా సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను లోకాయుక్త ఆదేశించింది. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంతో పాటు అక్రమ నిర్మాణాలు ఇక్కడ జోరుగా సాగుతున్నా పట్టించుకొ ళివడం లేదు. దీంతో మణికొండలో ఇబ్బడిముబ్బడి గా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై గ్రామస్తుడు ఫిర్యాదుపై 2010లో లోకాయుక్త కేసు నమోదుచేసింది. దీనిపై ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ జగన్నాధం విచారణ చేపట్టారు. సంయుక్త కలెక్టర్‌ జగన్నాథం గురువారం 9 అంశాలతో కూడిన నివేదిక
లోకాయుక్తకు సమర్పించారు. కేసును తీవ్రంగా పరిగణించినలోకాయుక్త ఛైర్మన్‌ సుభాషణ్‌రెడ్డి రెవెన్యూ అధికారులను విచారణ నుంచి తప్పించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఒకటవ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుంటే ఇక్కడ నిర్మాణాలను గ్రామపంచాయితీ లే ఔట్లతో పాత డేట్లతో తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.