మధ్యాహ్నం హైదరాబాద్‌లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ

హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించడం పట్ల మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. కర్ణాటక ప్రజలు బీజేపీని ఆదరించడం శుభపరిణామన్నారు. దేశం మొత్తం నరేంద్రమోదీ పరిపాలనను కోరుకుంటున్నారని, అందుకే ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీయే గెలుస్తూ వస్తోందన్నారు. మధ్యాహ్నం నగరంలో విజయోత్సవ ర్యాలీ జరగనుందని, ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు.