మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత`

ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని

దిల్లీ,మే 10(జనంసాక్షి):మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను దిల్లీలోని అఖి భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో చేర్పించారు. ఆదివారం రాత్రి 8.45 గంట సమయంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన గుండె చికిత్స విభాగంలో కార్డియాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నితీశ్‌ నాయక్‌ పర్యవేక్షణలో ఉన్నారు. మార్చిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాను వాయిదా వేయడానికి ముందే మన్మోహన్‌సింగ్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విశ్రాంతి తీసుకోవాని ఆయనకు వ్యక్తిగత వైద్యు సూచించారు. 2009లోనూ మన్మోహన్‌సింగ్‌కు ఎయిమ్స్‌లో బైపాస్‌ సర్జరీ జరిగింది.