మమతా బెనర్జీ మాట నిలుపుకోవాలి: జైట్లీ

a6g18uxoకోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామని మమతా బెనర్జీ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని సూచించారు. బుధవారం  ప్రారంభమైన పశ్చిమ బెంగాల్ అంతర్జాతీయ వ్యాపార సదస్సులో ఆయన ప్రసంగించారు.

‘ మమతాజీ.. రాష్ట్రాన్ని పరిపాలించాలని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మీదే’ అని జైట్లీ అన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి అవసరమైన సహాయం అందిస్తామని ఆయన హామీయిచ్చారు.