మరణశిక్ష రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్‌

న్యూఢిల్లీ : మరణశిక్షను రద్దు చేయాలంటూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. ఈ తీర్మానానికి మద్దతుగా 110 దేశాలు ఓట్‌ చేయగా భారత్‌ సహా 39 దేశాలు ఈ తీర్మానాన్మి వ్యతిరేకించాయి. అమెరికా, చైనా, ఇరాన్‌, ఇండియా, నార్త్‌కొరియా తదితర దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన వాటిలో ఉన్నాయి. అయితే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన మరుసటిరోజే భారత్‌ కసబ్‌ను ఉరి తీయడం విశేషం.