మరోమారు పెరగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ,జూలై5(జ‌నం సాక్షి ): పెట్రోల్‌, డిజీల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌ పై 17 పైసలు, డీజిల్‌ పై 12 చొప్పున రేట్లు పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దాదాపు 36 రోజుల తర్వాత గురువారం పెట్రోల్‌, డిజీల్‌ ధరలు పెరిగాయి. రోజు వారీ సవిూక్షలో భాగంగా అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ధరలు పెంచారు. గత నెల రోజుల్లో పెట్రోల్‌ ధరలు 22 సార్లు, డీజిల్‌ ధరలు 18 సార్లు తగ్గించారు. మిగతా రోజుల్లో యథావిథిగా ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల చూస్తుంటే ముడి చమురు ధరలు మరింత పెరగనున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ వియోగదారులకు ధరల వాత తప్పేట్టు లేదు.