మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్‌

కాబూబ్‌ : ఆప్ఘనిస్థాన్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. జలాలాబాద్‌లోని పోలీస్‌ స్థావరంపై ఏడుగురు ఆత్మాహుతిదళ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ముందుగా గేటు వద్ద కారు బాంబు పేల్చి తీవ్రవాదులు, ఆ వెనువెంటనే మరో రెండు మానవ బాంబులను ప్రయోగించారు. పోలీస్‌ శిబిరంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా..ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మృతిచెందగా, ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.