మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్‌

ఢిల్లీ: దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భూమి లావాదేవీల్లో సోనియా గాంథీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా అవినీతిని , నిధులదుర్వినియోగానికి పాల్పడ్డంటూ కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ను, మహారాష్ట్ర నీటి పారుదల కుంభకోణంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారీని కేజ్రీవాల్‌ బయటకు తెలిసిన విషయం తెలిసిందే.