మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ నాయకులు.

మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ నాయకులు

మల్కాజిగిరి.అక్టోబర్17(జనంసాక్షి)
మల్కాజిగిరి మండలం ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు చెరుకు సాంబరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు.మల్కాజిగిరిలో ముదిరాజుల మద్దతు తమకే ఉంటుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని దీంతో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ముదిరాజులను బిసి-డి నుండి ఎ-కు మార్చే విధంగా కృషి చేయాలని అలాగే మల్కాజిగిరి సర్కిల్లో ముదిరాజ్ భవనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు సానుకూలంగా స్పందించిన ఆయన ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈకార్యక్రమంలో బిక్షపతి, ప్రసాద్,సురేష్,శంకర్,పరశురాం, శ్రీనివాస్,కురుమయ్య,బాలచందర్, లింగం,వెంకటేష్,రాజు,కిషోర్, ఆంజనేయులు,రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు