మహనీయుల విగ్రహాలకు రంగులు వేయించిన మునిసిపల్ చైర్మన్

అయిజ, ఆగస్టు 14 (జనం సాక్షి):
జోగుళ్లాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం డా.బి ఆర్ అంబెడ్కర్, మహాత్మా గాంధీ,మరియు బాబు జగ్జీవన్ రాం  విగ్రహాలకు రంగులు వేయుటను మునిసిపల్ చైర్మన్  చిన్న దేవన్న ఆదేశానుసారం మునిసిపల్ కమిషనర్  గోల్కొండ నర్సయ్య పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగి ఈ సంవత్సరం తో 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల విగ్రహాలకు రంగులు వేసి వారిని ముస్తాబు చేయడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్  రాజేష్ ,కౌన్సిలర్లు . యస్ రాణెమ్మ , పూజారి వెంకటేష్ ,సీనియర్ అసిస్టెంట్ లక్ష్మన్న ,ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్  వీరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.