మహబూబాకు గవర్నర్‌ ఆహ్వానం

1

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోరా శనివారం ఆహ్వానించారు. అమె పీడీపీ- భాజపా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారు. ఇరు పార్టీలు చర్చలు ముగించి ఓ అంగీకారానికి వచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని గవర్నర్‌కు అందించారు. దీంతో ఆయన మెహబూబా ముఫ్తీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆమె జమ్మూలోని రాజ్‌ భవన్‌లో జమ్ముకశ్మీర్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.