మహాత్మా గాంధీజీ ఆశయాలు కొనసాగించాలి -ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల రూరల్ సెప్టెంబరు 02(జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ 153 వ జయంతి సందర్భంగా చింతలపేట సమీపంలో లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం శాంతి కి మార్గదర్శిఅని గాంధీ గారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు దేశం అంతటిని ఒకే తాటిపైకి తెచ్చి స్వాతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి తన చివరి శ్వాస వరకు శాంతి అహింసా మార్గాలను ప్రచారం చేశారు బడుగు బలహీన అభ్యున్నతి కృషిచేసిన వ్యక్తి అని , గ్రామ పంచాయతీలు బాగు పడినప్పుడు గ్రామ పంచాయతీలు బాగుపడే రోజు దేశం బాగుపడుతుందని గ్రామాలు అభివృద్ధి చెందాలని, స్వచ్ఛభారత్ ఆకాంక్షించారు తెలిపారు.గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కెసిఆర్ తో సాధ్యమవుతుంది.నేటి యువత గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్,జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి,గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు,కౌన్సిలర్స్ కృష్ణ నాగరాజు తదితరులు పాల్గొన్నారు