మహారాష్ట్రతో చర్చలు సఫలం

5

– మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌  ,మే10(జనంసాక్షి):మేడిగడ్డ బ్యారేజీ పై తెలంగాణ, మహారాష్ట్రరాష్ట్రాల మధ్య చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్‌ లో త్వరలో జరిగే గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి రావలసిందిగా మహా రాష్ట్ర సీఎం ఫడ్న వీస్‌ ను ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావు ఆహ్వానించారు. ఇందుకు ఫస్న వీస్‌ సానుకూలంగా స్పందించారు. ముంబైలో మంగళవారం నాడు మహారాష్ట్ర సీఎం ఫడ్న వీస్‌ ను హరీష్‌ రావు కలిశారు. గోదావరి ఇంటర్‌ స్టేట్‌ బోర్డు సమావేశం తేదీ నిర్ణయించాలని హరీష్‌ రావు కోరారు..తర్వాత రెండు రాష్ట్రల ఇరిగేషన్‌ మంత్రులు, అధికారులతో గంటకు పైగా చర్చలు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు, ప్లాన్లు, సాంకేతిక వివరాలపై రెండు రాష్ట్రాల సెంట్రల్‌ డిజైను ఆర్గనైజేషన్స్‌(సిడివో) ఇంజనీర్లు ఫైనలైజ్‌ చేస్తారు. తర్వాత జరిగే గోదావరి అంతర రాష్ట్ర బోర్డు అపెక్స్‌ కమిటీ సమావేశానికి సిడిఓ ల నివేదిక ప్రాతిపదిక కానున్నది.

తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సాగు నీటిపారుదల మంత్రలు హరీష్‌ రావు ,  గిరీష్‌ మహాజన్‌ తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌.కె. జోషి, కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు, మహరా?ష్ట్ర  గింజన సంక్షేమశాఖ మంత్రి గడిచిరోలి జిల్లా ఇన్చార్జ్‌   అంబరీష్‌ ఆత్రం , ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఐఎస్‌. చహాల్‌,      చీఫ్‌ ఇంజనీర్‌ చౌహా న్‌, ఎగ్జిక్యూటివ్‌  డైరక్టర్‌ కులకర్ణి , ఎస్‌ఇ రామ్‌ టేకె చర్చలలో పాల్గొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుతో మహారాష్ట్రకు ముంపు సమస్య లేదని ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌, మహారాష్ట్ర మంత్రికి వివరించారు.రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌ అధికారుల బృందాలు సంయుక్తంగా జరిపిన సర్వే వివరాలపై హరీష్‌, గిరీష్‌ సవిూక్షించారు. మహారాష్ట్రలో మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల తలెత్తే ముంపు సమస్యలపై వ్యాప్కోస, రెండు రాష్ట్రాల బృందాల గ్రాండ్‌ సర్వేలు జరిపాయి . 2 ూ16 ఏప్రిల్‌ 19 న  సర్వే పూర్తయింది.  గోదావరి పై తెలంగా ణ,మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టు కు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 11 గ్రామాల సరిహద్దులలో  కేవలం 55 హెక్టార్ల భూమి మాత్రమే ముంపునకు గురవుతున్నట్లు రెండు రాష్ట్రల మంత్రులు నిర్ధారించుకున్నారు.             అతి తక్కువ ముంపుతోనే ప్రాజెక్టులు నిర్మించాలని కెసిఆ ర్‌ సంకల్పించినట్టు టి.ఎస్‌. భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌ రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు. ఈ వాదనతో మహారాష్ట్ర కూడా  ఏకీభవించింది.అయితే మేడిగడ్డ బారేజీ నిర్మాణం వల్ల 25 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని, 25 వేల హెక్టార్లలో భూములు ముంపునకు గురవుతాయనీటూ  మహారాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు విష ప్రచారం చేస్తుండడం, సిరొంచ  తదితర ప్రాంతాలలో దురుద్దేశ పూర్వకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతునీడడాన్ని రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌ మంత్రులు హరీష్‌, గిరీష్‌ ముంబైలో విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు.  సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో ప్రాంతానికో విధానం, రాష్ట్రానికో సిధాంతాన్ని కాంగ్రెస్‌ అవలంబిస్తున్నట్టు ఇద్దరు మంత్రులు ఆరోపించారు.                 2015 ఫిబ్రవరి 17న    సీఎం కెసిఆర్‌  మొదటిసారిగా ముంబయి వెళ్ళి  ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ తో చర్చించారు.  2016 మార్చి 8న మరోసారి ఇద్దరు సీఎంల సమావేశమయ్యారు. మహారాష్ట్రలో లాలూచీ పడ్డామని, చీకటి ఒప్పందం చేసుకున్నామంటూ జరుగుతున్న విష ప్రచారాన్ని మంత్రి హరీ ష్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మహారాష్ట్ర, తెలంగాణ సంయుక్తంగా లై డార్‌ సర్వే లు నిర్వహించిన తర్వాతే ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు అవగాహనతో నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్‌ చేసి బిఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత,  కాళేశ్వరం ప్రాజెక్టులుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది. కాగా నిజామాబాద్‌ జిల్లా లోని లెండి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని హరీష్‌ కోరారు. మహారాష్ట్ర సానుకూలంగా స్పందించింది.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినపుడే మహారాష్ట్రతో త్వరలో తుది ఒప్పందాలు జరుగుతాయని సీఎం ప్రకటించారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలు సానుకూల వైఖరితో, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకొని   ప్రాజెక్టులు నిర్మించుకోవాలని కెసిఆర్‌, హరీష్‌ భావిస్తున్నారు.