మాజీ కౌన్సిలర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

మాజీ కౌన్సిలర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఇల్లందు అక్టోబర్ 20 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో జడ్పిటిసి కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. ఇల్లందు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ అధ్యక్షతన ఈ గురువారం రోజు స్థానిక జెకె కాలనీలోని జెడ్పీ చైర్మన్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విధివిధానాలకు ఆకర్షితులై పట్టణ మాజీ కౌన్సిలర్ బాదావత్ సరోజ, తో పాటు బీ ఆర్ఎస్ యువజన సంఘం నాయకులు గోపగాని రాజు, మరో 10 మంది కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరిని కనకయ్య ఆహ్వానిస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కోసం పూర్తిస్థాయిలో తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపగాని రాజు కొండపల్లి సావిత్రి కొండపల్లి మహేష్ ధారా వెంకన్న అయితా సత్యం సుమన్ కృష్ణ కాలుద్ది ముఖి శివ తదితరులు పాల్గొన్నారు.