మాదిగ జేఏసీ మండల అధ్యక్షులుగా కృష్ణ

నియామక పత్రం అందజేసిన చంద్రస్వామి
మునుగోడు నవంబర్10(జనం సాక్షి):
మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డా”పిడమర్తి రవి ఆదేశాల మేరకు మునుగోడు మండల
అధ్యక్షులుగా మండలంలోని జంస్తాన్ పల్లి గ్రామానికి చెందిన అందుగుల కృష్ణను గురువారం మండల కేంద్రంలో మునుగోడు నియోజక వర్గం ఇంచార్జి మేడి చంద్రస్వామి నియామక పత్రం అదజేశారు.ఈకార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లాకార్యదర్శి దండు పరశురామ్,మేడి అశోక్,పందుల సురేష్,గందం లింగస్వామి,
గురుజాల శ్రవణ్,మేకల మహేష్,రాజు,జి.వెంకన్న,సందపాకా రాంబాబు,దండు స్వామీ,అహ్మద్ తదితులున్నారు.