మానవత్వం చాటుకున్న జక్కుల కిష్టమ్మ

వనపర్తి జనం సాక్షి సెప్టెంబర్ (24):మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామానికి చెందిన జక్కుల కిష్టమ్మ శనివారం మృతి చెందడంతో తన మరణ అనంతరం తన దేహాన్ని మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల కు పరిశోధన నిమిత్తం ఇవ్వమని చెప్పడంతో తమ కుమారుడు జక్కుల వెంకటయ్య స్వగ్రామంలో అంతిమ శోభాయాత్ర నిర్వహించి అనంతరం మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించి సమాజంలో మానవత్వాన్ని చాటుకున్నారు ఇది చూసిన గ్రామ ప్రజలు బంధువులు గ్రామ సర్పంచ్ పాత పల్లి భాస్కర్,వాల్మీకి రాష్ట్ర నాయకులు పుట్టినేని గోపాలకృష్ణ నాయుడు, సిపిఎం మండ్ల రాజు ,వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు, చంటి నాయుడు, వెంకటయ్య కుటుంబాన్ని అభినందించారు.