మానవత్వం చాటుకున్న పవన్ కళ్యాణ్ వీరాభిమానులు

అయిజ, సెప్టెంబర్ 2 (జనం సాక్షి):


జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ మానవత్వం చాటారు వివరాల్లోకి వెళితే ఐజ సంత బజార్ కాలనీలో నివాసముంటున్న తిమ్మప్ప గోవిందమ్మ కుమారుడు బీచుపల్లి, ఈయన డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై తన రెండు కళ్ళను కోల్పోవడం జరిగింది. ఈ ఇంటికి పెద్ద దిక్కు బీచ్ పల్లి కావడంతో కుటుంబం గడపడం ఇబ్బందిగా మారింది .ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని దీన్ని గుర్తించిన కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు బీచుపల్లి కి సహాయం చేయాలని తలిచి  పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బీచుపల్లి కుటుంబం కు ఆరు నెలలు సరిపడా నిత్యవసర సరుకులు రెండు క్వింటాళ్ల బియ్యం అందజేసి మానవత్వం చాటారు అంతేకాకుండా దాతలు ముందుకు వచ్చి బీచుపల్లి కుటుంబాన్ని ఆదుకోవాలని అభిమానులు కోరారు. ఈ కార్యక్రమంలో బోయ జమ్మన్న, రాము, రవి, అబ్దుల్లా ,శేఖర్ ,నవీన్, అంజి ,ప్రదీప్ ,తదితరులు పాల్గొనడం జరిగింది.