మానవత్వం చాటుకున్న…. _జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…

గద్వాల రూరల్ జూన్ 13 (జనంసాక్షి):- జోగులాంబ  గద్వాల జిల్లాలోని పలు  పర్యటనలను ముగించుకుని తిరిగి జడ్పీ క్యాంపు కార్యాలయానికి వస్తున్న మార్గమధ్యంలో గద్వాల మండలంలోని పుటన్ పల్లి గ్రామ శివారులో  నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన వ్యక్తి కింద పడిన వ్యక్తి గాయాలపాలయ్యారు.జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య తన వాహనాన్ని దిగివచ్చి తనతో మాట్లాడి అంబులెన్స్ కి ఫోన్ చేసి,గాయాల పాలైన వ్యక్తిని హాస్పటల్లో చేర్పించడం జరిగినది.