మానవత్వాన్ని చాటుకున్న మాజీ ఎంపీటీసీ ఉప్పుగల మల్లారెడ్డి

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 13 శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు మాజీ ఎంపీటీసీ ఉప్పు గళ్ళ మల్లారెడ్డి మంగళవారం కేశవపట్నం కేడీసీసీ బ్యాంకు ముందు తన మోటార్ సైకిల్ ఉంచి బ్యాంకు లావాదేవీలు జరుపుతుండగా చింతల పల్లె గ్రామానికి చెందిన దోతుల శ్రీనివాస్ కేశపట్నం కేడీసీసీ బ్యాంకులో 50వేల రూపాయలు డ్రా చేసుకొని తన మోటార్ సైకిల్ అనుకొని అరపాటులో పొరపాటుగా 50వేల రూపాయలను బ్యాంకు పాస్బుక్కును కొత్తగట్టు మాజీ ఎంపీటీసీ మోటార్ సైకిల్ పెట్టాడు బైక్ తీస్తుండగా పరిశీలిస్తుండగా 50వేల రూపాయలు బ్యాంకు పాస్బుక్ కనిపించాయి పాస్ బుక్ లో ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా దోస్తుల శ్రీనివాస్ సమాచారం ఇచ్చి తన మోటార్ బైక్ లో ఉన్న 50వేల రూపాయలను పల్లకి చెందిన శ్రీనివాస్ ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు