మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ

చెన్నై: కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ లకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారికి చెందిన రూ.742 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై స్టే ఇవ్వాలని కోరుతూ వారు కోర్టును ఆశ్రయించారు. పిటీషన్ ను పరిశీలించిన న్యాయస్థానం కొట్టివేసింది.