మా పార్టీ నాయకులపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తాం .

భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు హెచ్చరిక.

 

అచ్చంపేట ఆర్సి , ఆగస్టు 16 (జనం సాక్షి న్యూస్ ) : నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు మాట్లాడుతూ… మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంటే టిఆర్ఎస్ గుండాలు రాళ్లతో కట్టెలతో పాదయాత్ర చేస్తున్న బిజెపి కార్యకర్తలపై దాడి చేశారని, ఈ ఘటన ను నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపుమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు మానుకోవాలని అన్నారు. రెండో విడత పాదయాత్ర జరుగుతుంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఇదేవిధంగా దాడులు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా టిఆర్ఎస్ గుండాలపై ప్రతి దాడి చేసి తరిమి తరిమి కొట్టినటువంటి సందర్భాన్ని మహబూబ్ నగర్ బిజెపి కార్యకర్తలు చేశారని అన్నారు .భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూయించ కుండా అవసరమనుకుంటే ప్రతి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, నక్సలైట్ల తూటాలకు భయపడని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాళ్లకు కట్టెలకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రాణాలను సైతం అర్పించి తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇదొక హెచ్చరిక అన్నారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గోలి రాజు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పగిడి పాల అనిల్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భోగరాజు శంకర్. కూరాకుల శివ . నల్లగంతుల సాయి. సురకారపు భరత్ .హనుమంతు .కంచర్ల శివ. భూషరాజు సాయి. డీజే రాజు తదితరులు పాల్గొన్నారు.