మిర్యాలగూడలో ఆందోళన చేపట్టిన రైతులు

నల్గొండ: అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన తమ పంటలను అధికారులు పరిశీలించడం లేదని మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు వెంటనే నష్టపోయిన తమ పంటలను పరిశీలించి పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.